Type Here to Get Search Results !

విద్యార్థినీ విద్యార్థులకు 'షూస్' పంపిణీ

విద్యార్థినీ విద్యార్థులకు 'షూస్' పంపిణీ

 

 న్యూస్ , 11 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న 168 మంది విద్యార్థులకు మంగళ వారం రోజున షూస్ పంపిణీ చేశారు దాతలు
ఎస్ వీరారెడ్డి ఎస్ ఎ సోషల్,జడ్ పి హెచ్ ఎస్ రేపాక
టి సాంబశివుడు ఎస్ ఎ ఇంగ్లీష్, జడ్పీహెచ్ఎస్ గాలిపెల్లి
 కూనబోయిన వినోదఅమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్
 ఆర్.రమణారెడ్డి ఎస్ ఎ ఇంగ్లీష్, జడ్ పి హెచ్ ఎస్ ఇల్లంతకుంటదాతల సహకారంతో 50 వేల రూపాయల విలువైన షూస్ పంపిణీ చేశారు  
 ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి,బాగా చదవాలని తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. ప్రేమలత మాట్లాడుతూ దాతలు ఇచ్చిన షూస్ ను కాపాడుకోవాలని,వాటిని వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం దాతలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు వి.మహేష్ చంద్ర,ఆర్ రమణారెడ్డి, ఎస్.మధుసూదన్ రావు, ఎం . మంజుల, ఐ. ప్రదీప్ రెడ్డి, పి. అనిల్ కుమార్, పి. సునీత, సి.హెచ్.పుష్పలత, ఏ.కవిత, సి.హెచ్.సంపత్ రావు, ఎన్. సత్తయ్య, ఎస్.సుజాత దేవి 
మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.