బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి

బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి 
జనం న్యూస్ , 30 జనవరి , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో  బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం పై అక్కేం నాగరాజు
 నిరసన వ్యక్తం చేశాడు  
20 రోజుల్లో బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిచాలి లేకపోతే  ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణ ని మండల కేంద్రం లో తిరగనివ్వమన్నారు  
ఈ సందర్బంగా అక్కేం నాగరాజు మాట్లాడుతూ 2016-2017 సంవత్సరం లో దాదాపు గా 3 కోట్ల రూపాయకు పైగా అంచనాతో మొదలు పెట్టిన బిక్క వాగు నిర్మాణం అర కోరగా సాగిన పనులు అప్పటి నుంచి ఏబీవీపీ ఈ బ్రిడ్జి నిర్మాణం మంద కోడి గా సాగుతుంది అని అనేక సార్లు నిరసనలు ధర్నాలు చేసి బ్రిడ్జి నిర్మాణం 90%అయ్యేలా పోరాటాలు చేసిన ఏబీవీపీ గత ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి నిర్మాణం జరిగేలా చేసారు కానీ నేటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం తో మండల ప్రజలు అలాగే జిల్లెల్ల కి వెళ్లే ప్రధాన రహదారి ఇది నిర్మాణం పూర్తి కాకపోవడం తో ప్రజలు బిక్కు బిక్కు మంటూ రాత్రి పూట ప్రయాణం సాగిస్తున్నారు రోడ్డు కి పక్కల కి రక్షణ కవచం లేకపోవడం తో అందులో పడి ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయినా మానకొండూర్ శాసనసభ్యుడు కావ్వంపల్లి సత్యనారాయణ  2024 ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ మర్చిపోయారు బ్రిడ్జి నిర్మాణం గెలిచాక చేస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేసారు అని అలాగే బ్రిడ్జి నిర్మాణం 20 రోజుల్లో పూర్తి చేయకుంటే ఎమ్మెల్యే ని ఎక్కడికి అక్కడే అడ్డుకుంటాము అని హెచ్చరించారు.

ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్

ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్
• ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ 
జనం న్యూస్ , 28 జనవరి , ఇల్లంతకుంట :
జిల్లా ఎస్పీ సూచనల మేరకు
ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్
లో భాగంగా 80 ఆటోలకి కోడ్ తో అనుసంధానం చేసిన స్టికర్స్ అందజేసినట్లు ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆసురక్షితంగా భావించే ఏదైనా పరిస్థితిని సంఘటనలను ఎదుర్కొన్నపుడు ఆటోకి ముద్రించిన "క్యూ అర్ కోడ్"ను స్కాన్ చేయాలని స్కాన్ చేయగానే వెంటనే డ్రైవర్ ఫోటో,వివరాలతో పాటుగా వాహనంకి సంబంధించిన వివరాలు వస్తాయి స్కాన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ యాప్ లో ఎంట్రీ చేసి  ట్రేస్ ద లొకేషన్ అని ఎంట్రీ చేయగానే వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్  ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్  వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది ఆటోలో ఎక్కినప్పటి నుండి దిగేంతవరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా  మానిటర్ చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని తగు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

గతంలో ఆటో డ్రైవర్  ఏదైనా పోలీస్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే  థిస్ ఆటో నాట్ సేఫ్ అనే రెడ్ సిగ్నల్ వస్తుంది ఇది ప్రయాణికులకు సేఫ్ జర్నీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు.

వంతడుపుల గ్రామ బిజేపి బూత్ అధ్యక్షుల నియామకం

వంతడుపుల గ్రామ బిజేపి బూత్ అధ్యక్షుల నియామకం
 న్యూస్ , 28 జనవరి , 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం 
వంతడుపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షులను నియమించడం జరిగింది 269 బూత్ చిమ్మరగొట్టు శ్రీనివాస్ మరొక్క బూత్ 270 బూత్ పండు నరేష్ జనరల్ సెక్రెటరీగా మధు రెడ్డి కీసర పవన్ , 
శక్తి కేంద్రం ఇంచార్జ్ కాట్నపల్లి రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు రాజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బిజెపి కార్యకర్తలు దుర్ముట్ల కనకయ్య చింటూ శేఖర్ రాజు బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సభ లా లేక కాంగ్రెస్ సభ లా ?

గ్రామ సభ లా లేక కాంగ్రెస్ సభ లా ?
 • బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ 
జనం న్యూస్ , 24 జనవరి , ఇల్లంతకుంట :
పథకాలు పేరుతో గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల అతి ఉత్సాహం అప్రజాస్వామికంగా ఉంది అని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ అన్నారు ,ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం  ఆయన మాట్లాడుతూ, మండలంలో జరగుతున్న గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు స్పెషల్ ఆఫీసర్ల లాగా వ్యవహరించడం బాధాకరం అన్నారు ఇప్పటికైనా అధికారులు వారి బాధ్యత వారు నిర్వహించి అర్హులైన సామాన్య ప్రజలకు పథకాలు అందే విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేసారు లేని పక్షంలో లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పెద్ద ఎత్తున  పోరాటం చేస్తాం అన్నారు ఈ కార్యక్రమం లో తాజా మాజీ ఉపసర్పంచ్ లు బుర్ర బాలకిషన్ యాదవ్ ,గోజగాని కిషన్ రావు, రాములు యాదవ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకి ఏంపిక

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకి ఏంపిక 
 
 న్యూస్ , 21 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం లోని రహీమ్ పేట ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి. మైథిలి  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖమ్మం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఏంపికాయినట్లు ప్రిన్సిపాల్ జి. గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.జగిత్యాల జిల్లా లో జరిగిన ఉమ్మడి జిల్లా క్రికెట్ స్థాయి పోటీలలో అత్యున్నత ప్రతిభని కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకి ఏంపిక అయినట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు మామిడి శ్రీను తెలిపారు.ఈనెల 22 నుండి  24 వరకు జరిగే పోటీలలో మైథిలి పాల్గొంటున్నాదని ఏస్ జి ఎఫ్ సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అభినంచించారు.